Monday, May 13, 2024

గ్రూపుల మధ్య ఘర్షణ: 75 మంది ఖైదీలు మృతి

- Advertisement -
- Advertisement -

Prison riots in Ecuador leave 75 dead

 

క్విటో: దక్షిణ అమెరికాలోని ఈక్వెడర్ జైళ్లో రెండు డ్రగ్ గ్రూపుల మధ్య గొడవ జరగడంతో 75 మంది ఖైదీలు చనిపోయారు. ఖైదీల మధ్య ఘర్షణ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డ్రగ్ వ్యాపారంపై పట్టుకోసం గ్రూప్‌ల మధ్య గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ వీడియోలో తలలు, కాళ్లు, చేతులు తెగిపడినట్టుగా భయనకంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జైళ్లను భద్రతా సిబ్బంది తన ఆధీనంలోకి తీసుకున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని జైలు సిబ్బంది వెల్లడించారు. సెంట్రల్ అమెరికాకు కొకైన్ సరఫరా చేసేందుకు గ్యాంగ్ వార్ జరిగినట్టు సమాచారం. కొలంబియా, పెరూ దేశాల్లో ఉత్పత్తి అయ్యే కొకైన్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు ఈక్వెడర్‌లో ఉన్న డ్రగ్స్ మాఫియాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News