- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన రాజస్థాన్కు చెందిన ఫైజాన్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సన్మానం చేశారు. నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ను సివిల్స్లో 58వ ర్యాంక్ సాధించిన రాజస్థాన్ కోటాకు చెందిన ఫైజాన్ కలిశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ మెంటార్ వాట్సప్ గ్రూపులో ఫైజాన్ పలు సూచనలు, సలహాలు తీసుకుని విజయం సాధించాడు.
- Advertisement -