- Advertisement -
హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి కరోనా మహమ్మారిని జయించాడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా నుంచి బయటపడ్డారు. రెండు వారాల హోమ్ క్వారంటైన్ పూర్తి కావడంతో వీరందరూ మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో అందరికీ నెగటివ్ వచ్చినట్లు రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. రాజమౌళి ట్వీట్ చేస్తూ.. “రెండు వారాల హోమ్ క్వారంటైన్ పూర్తయింది. మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోగా మా అందరికీ నెగటివ్ వచ్చింది. ప్లాస్మా దానం చేయడానికి మమ్మలి మరో మూడువారాలు వేచి ఉండాలని డాక్టర్స్ చెప్పారు. అప్పటి వరకు శరీరంలో అవసరమైన యాంటీ బాడీస్ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తాం” అని పేర్కొన్నాడు.
Rajamouli test negative for Corona
- Advertisement -