Sunday, April 28, 2024

ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త…

- Advertisement -
- Advertisement -

గంట ముందే ఇంటికి వెళ్ళేలా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు
హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ముస్లిం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా గంట ముందే ఇంటికి వెళ్లేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసం లోనే దివి నుంచి భువి పైకి అవతరించింది. దీనికి ప్రతీకగా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News