Thursday, May 2, 2024

మసాజ్ పేరుతో విదేశీ వనితపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

 

పనాజి: మసాజ్ చేస్తామని చెప్పి భర్త ముందే విదేశీ వనితపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన గోవాలోని అరంబోల్ బీచ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి గోవాకు చెందిన గోవా బీచ్‌లో భార్యభర్తలు సేదతీరుతుండగా వారిని మసాజ్ చేయించుకోవాలని విన్సెంట్ కోరాడు. దీంతో సదరు మహిళ మసాజ్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. గదిలోకి తీసుకెళ్లిన తరువాత ఆమెపై మసాజ్ చేస్తూ అత్యాచారం చేశాడు. తనపై అత్యాచారం జరిగిందని బ్రిటన్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. భారత్‌లోని ఉన్న బ్రిటీష్ ఎంబసీకి సమాచారం ఇవ్వగానే కొన్ని గంటలలోని నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News