- Advertisement -
అమరావతి: దుకాణంలో పని చేస్తున్న యువతికి మత్తు మందు ఇచ్చి ఆమెపై యజమాని అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా కాలేజీ లేకపోవడంతో కుటుంబానికి ఆసరాగా ఉండటానికి ఓ దుకాణంలో ఐదు వేల రూపాయలకు పని చేస్తోంది. దుకాణంలో ఎవరు లేని సమయంలో యువతికి యజమాని శీతల పానీయం మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరువాత యువతిపై అత్యాచారం చేశాడు. తనపై అత్యాచారం జరిగిందనే విషయం తెలుసుకొని తల్లిదండ్రులకు తెలపడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
- Advertisement -