లక్నో: ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఆరోపణలు రావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తరువాత అతడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిబియాపూర్కు చెందిన ఓ మహిళ ఈటావాహ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. భర్త చనిపోవడంతో తన తల్లిగారింటి వద్దనే ఉంటుంది. బ్రహ్మనగర్లో అద్దెకు రూమ్ తీసుకొని నివసిస్తోంది. పతేపూర్ చెందిన వ్యక్తి దెవ్కాళీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. సదరు మహిళతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కానిస్టేబుల్ నిరాకరించడంతో దిబియాపూర్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 4న ఈతావా నుంచి కానిస్టేబుల్ ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అతడు చనిపోయాడు. నవంబర్ 2న బాధితురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అత్యాచారం చేసిన కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి… మహిళ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -