- Advertisement -
లక్నో: ప్రియుడ్ని రుబ్బురోలుతో ప్రియురాలు బాది హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని హమీర్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనురాగి, వీరేందర్ అనే యువతి యువకుడు పారిపోయి భటియానాలో సహజీవనం చేస్తున్నారు. వీరేందర్ తన ప్రియురాలుతో కలిసి తన సొంతింటికి రాత్ ప్రాంతానికి వచ్చాడు. వీరేందర్ తల్లి, అన్నదమ్ములు పనికి వెళ్లిన తరువాత అనురాగికి, వీరేందర్ మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రుబ్బు రోలుతో అతడి తలపై అనురాగి బాదింది. వెంటనే ఘటనా స్థలం నుంచి ప్రియురాలు పారిపోయింది. తల్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తనయుడు రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
- Advertisement -