Saturday, April 27, 2024

మంత్రి కిషన్‌రెడ్డికి అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ జరిగే సమావేశంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం; అత్యవసర కార్యాచరణ కోసం దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ అంశంపై కిషన్‌రెడ్డి ప్రసంగించనున్నారు . ఈ సమావేశాలకు ఆహ్వానం అందుకున్న మొదటి భారత పర్యాటక మంత్రిగా అరుదైన గౌరవాన్ని కిషన్‌రెడ్డి అందుకున్నారు. ‘జీ -20 టూరిజం చైర్’ హోదాలో ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటీవలే గోవాలో జరిగిన జీ- 20 దేశాల పర్యాటక మంత్రుల సమావేశాల్లో ‘గోవా రోడ్ మ్యాప్’

రూపంలో భారత దేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి విధితమే. హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులు, బడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కిషన్‌రెడ్డి ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటన సందర్భంగా 14, 15 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పలు చారిత్రక మ్యూజియంలను సందర్శించనున్నారు. పలు పర్యాటక రంగ సంస్థల ప్రతినిధులతో చర్చిచనున్నారు. భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజలు, ప్రముఖులతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని, ప్రసంగిస్తారు. అనంతరం ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి’ సమావేశంలోనూ కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.అక్కడి నుంచి లండన్ బయలుదేరి వెళ్లనున్న కేంద్రమంత్రి.. తిరిగి ఈ నెల 19వ తేదీ ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News