Friday, May 3, 2024

చిట్యాల మండలంలో పేలిన రియాక్టర్‌..

- Advertisement -
- Advertisement -

Reactor blast at nalgonda Veliminedu

 

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కంపెనీలో ఆదివారం రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలుడుకు విషవాయువులు చట్టుపక్కల వ్యాపించాయి. దుర్వాసనతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోనిచెర్వు గ్రామ ప్రజలు ఆందోళన పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News