Sunday, April 28, 2024

రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు: జోగి రమేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. గురువారం 50 వేలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని, సిఎం జగన్ పేదల పక్షాన… బాబు పెత్తందారుల పక్షాన నిలబడ్డారని విమర్శించారు. చంద్రబాబు అనే పెత్తందారీ కోటను బద్ధలుగొట్టామని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు అని జోగి దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారని, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా పేదల పక్షానే నిలబడ్డాయని, పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించామని జోగి పేర్కొన్నారు.

Also Read: వేసవి తాపం…. స్కూటర్‌పై యువజంట స్నానం (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News