- Advertisement -
హీరో రామ్ ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ.. “శనివారం సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. దేవదాసు, మస్కా తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలోఉంటాయి”అని అన్నారు.
RED Movie gets U/A Certificate from Censor board
- Advertisement -