Thursday, May 2, 2024

వ్యక్తిగత రుణాల నియంత్రణ

- Advertisement -
- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత రుణాలను కఠినతరం చేస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రజలు పర్సనల్ లోన్‌లను వేగంగా తీసుకోవడాన్ని ఆర్‌బిఐ ఎందుకు కోరుకోవడం లేదు? ప్రజలు ఎక్కువ రుణం తీసుకుంటే, ఈ నిధులతో అనేక వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణి పెరిగి, జిడిపి కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు వ్యక్తిగత రుణాలు తీసుకునే వారిని నిరుత్సాహపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వయంగా ఎందుకు పని చేస్తోంది? వాస్తవానికి, సెక్యూర్డ్ పర్సనల్ లోన్లలో భారీ పెరుగుదల ఉంది.

ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్టోబరు మొదటి వారంలోనే ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తిగత రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలను హెచ్చరించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ లోన్ ఇచ్చే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడింది. ఆగస్టు 25న కూడా శక్తికాంత దాస్ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలతో సమావేశం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News