Sunday, April 28, 2024

పూర్తి బాధ్యత నాదే

- Advertisement -
- Advertisement -

Revanth Reddy Reaction Huzurabad Results

కార్యకర్తలు ఆందోళన చెందొద్దు, హుజూరాబాద్ ఫలితంపై టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన బాధ్యత తనదేనని, హుజూరాబాద్‌లో జరిగిన పరిణామాలపై నివేదికలు తెప్పించుకొని విశ్లేషణ చేసుకుంటామని, రాబోయే రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవేనని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా, నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. మంగళవారం నాడు జూబ్లీహిల్‌లోని పార్లమెంట్ కార్యాలయంలో ఆయన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచాయని ఒక ఉప ఎన్నిక ఫలితాల వల్ల పార్టీ కార్యకర్తలు నిరాశచెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వెంకట్‌కు మంచి భవిష్యత్ ఉందని, కాంగ్రెస్ పార్టీలో వెంకట్ మంచి నాయకుడిగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయని న్నారు.

వెంకట్ హుజూరాబాద్ ప్రజల కోసం భవిష్యత్తులో పోరాటం చేస్తారని వారికి అండగా ఉంటారని అన్నారు. ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించలేవని, గత ఎన్నికల్లో బిజెపికి 1600 ఓట్లు మాత్రమే వచ్చాయని ఇప్పుడు విజయం సాధించిందని అన్నారు. మొన్న జరిగిన నాగార్జునసాగర్ ఎన్నికలో బిజెపి కనిపించలేదన్నారు. ‘మీ కోసం నేను ఉంటా, ఈ ఓటమి నన్ను కుంగదియ్యద’ని అన్నారు. ఈ ఓటమి వల్ల వచ్చిన నిరాశ శాశ్వతం కాదని నిరాశ నుంచి నిర్మాణం చేపడతామని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని, పార్టీ విషయాలను అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటామని వివరించారు. సీనియర్లను పార్టీ కార్యక్రమాల్లో మరింత ఎక్కువగా కలుపుకుని వెళతామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News