Thursday, May 2, 2024

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..విద్యుత్‌కు పెరిగిన డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం నల్గొండలో సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యని తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది.

రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని బయటకి వెళ్లాలని వాతావరణ నిపుణులు సూచించారు. వర్షాకాలంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున శరీర సమస్యలు వచ్చే అవకాశం ఉందని, పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి రోజు నీళ్లు అధిక మోతాదులో తీసుకోవాలని, ఒక్కోసారి దాహంగా అనిపించక పోయినా నీళ్లు తాగితే మంచిదని నిపుణులు సూచనలు ఇచ్చారు. మరోవైపు టెంపరేచర్ పెరిగిన పుణ్యమా విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. ఫ్యాన్లు, ఎసిలు, కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News