Thursday, May 2, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానాకు తరలించారు.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News