Thursday, May 2, 2024

మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు

- Advertisement -
- Advertisement -

Royal Challengers Bangalore score 66/3

అహ్మదాబాద్‌: ఐపిఎల్‌ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్‌(7) రిలే మెరిడిత్‌ వేసిన మూడో ఓవర్లో ఔటయ్యాడు. హర్‌ప్రీత్‌ వేసిన 11వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు విరాట్‌ కోహ్లీ(35), గ్లెన్‌మాక్స్‌వెల్ ఔటయ్యారు. ఇద్దరు వరుస బంతులకు బౌల్డయ్యారు. దాంతో ఆ జట్టు 62 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి ఏబీ డివిలియర్స్‌ వచ్చాడు. మరోవైపు రజత్‌(15) పరుగులతో కొనసాగుతున్నాడు. 12 ఓవర్లకు బెంగళూరు 03 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News