Thursday, May 2, 2024

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Rs 8 lakh foreign Currency seized in Shamshabad Airport

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేయగా.. అతని నుంచి అక్రమంగా తరలిస్తున్న 25వేల సౌదీ అరేబియా రియాల్స్‌, 22,500 యూఏఈ దిర్హామ్‌ లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీలో రూ.8లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Rs 8 lakh foreign Currency seized in Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News