Tuesday, April 30, 2024

తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

వేములపల్లి : తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ కుష్బు గుప్తా అన్నారు. గురువారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శెట్టిపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని, పాలకవర్గాన్ని ఆమె శాలువాలు కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఇరుగు మంగమ్మ, సర్పంచ్ మజ్జిగపు పద్మ, ఉప సర్పంచ్ కట్టా మట్టమ్మ, ఎంపిడిఓ అజ్మీరా దేవిక, కట్టా మల్లేష్ గౌడ్, నక్కా శేఖర్, గౌరు శ్రీనివాస్, పెదపంగ సైదులు, గోపాలరావు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News