Sunday, April 28, 2024

సైఫ్ వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి.. తల్లితో ఫోన్ లో ప్రీతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి పోన్ చేసి తన బాధను తెలిపింది. సైఫ్‌తో చాలా మంది సీనియర్లు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారని తల్లితో ఫోన్‌లో ప్రీతి చెప్పింది. సీనియర్లు అంతా ఒక్కటేనని, నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయిందన్నారు. సైఫ్ వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై తనని దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావని, హెచ్‌ఒడి నాగార్జున రెడ్డి ప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News