- Advertisement -
హైదరాబాద్: తన పరువుకు నష్టం కలిగించే రీతిలో కంటెంట్స్ పెట్టిన మూడు యూట్యూబ్ ఛానల్స్పై నటి సమంత కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాగచైతన్యతో బ్రేకప్ అయిన సందర్భంగా వారిద్దరిపై అనేక కథనాల కంటెంట్లు ప్రసారమయ్యాయి. అలా తన పరువుకు నష్టం కలిగించేరీతిలో ప్రసారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్- సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టివి సహా వెంకట్రావు అనే అడ్వకేట్పై కూడా ఆమె పిటిషన్లు దాఖలు చేశారు. సమంత తరఫున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
- Advertisement -