Thursday, May 16, 2024

సవతి తల్లిని కత్తితో పొడిచి…..

- Advertisement -
- Advertisement -

Son murder paternal mother

జైపూర్: సవతి తల్లిని కుమారుడు హత్య చేసిన సంఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తారా చంద్ అనే వ్యక్తి మొదటి భార్య పదేళ్ల క్రితం చనిపోయింది. ఆమె చెల్లెలు సరోజను తారాచంద్ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వ్యాపార నిమిత్తం సవతి తల్లి వద్ద కుమారుడిని ఉంచి తారాచంద్ ఢిల్లీకి వెళ్లాడు. తారాచంద్ వచ్చేసరికి సరోజ రక్తపు మడగులో కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందడంతో స్థానిక పోలీసులకు అతడు సమాచారం ఇచ్చారు. పోలీసులు తారాచంద్ కుమారుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. సవతి తల్లి, కుమారుడు మధ్య గొడవ జరగడంతో కత్తితో పొడిచి చంపానని వివరించారు. బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News