Monday, May 6, 2024

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద డ్రామా అని తెలంగాణ రెడ్కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆరోపించారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ ఇప్పుడు తప్పించుకునేందుకు కొత్తవేషాలు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బండి సంజయ్ అరెస్టు అయిన రోజు రాత్రి ఫోన్ ఆయనతోనే ఉందని.. తాను ఫోన్లో మాట్లాడానని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పారన్నారు. అలాగే అరెస్ట్ అయిన తర్వాత రోజు బండి సంజయ్‌తో తన ఫోన్లో మాట్లాడానని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ కూడా చెప్పారన్నారు. బండి సంజయ్ జైలు నుండి విడుదలైన సమయంలో అసలు ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారని.. ఫోన్‌లో ఏముందని అడుగుతున్నారంటూ పోలీసులపైనే ఆయన ఆ రోపణలు చేశారన్నా రు.

జైలు నుంచి విడుదలైన సమయంలో.. ఫోన్ ఎం దుకు ఇవ్వాలంటూ మాట్లాడిన బండి సంజ య్ ఇవాళ తన ఫోన్ పోయిందంటు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం పెద్ద డ్రామా అన్నారు. నిజంగానే ఫోన్ దొరక్క పోతే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎందుకు ఫిర్యా దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఓ కేసు విషయంలో దర్యాప్తు కోసం పోలీసులు గానీ, మరే ఇతర దర్యాప్తు సంస్థలు గానీ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అడిగినప్పడు వారికి అందజేయాలన్నారు కానీ బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వ డం లేదంటే కచ్చితంగా పదో తరగతి పరీక్ష పశ్నాపత్రం లీకేజీలో తన ప్రమేయం ఉందని అంగీకరించినట్టేనని సతీష్ రెడ్డి అన్నారు. అన్ని సాక్షాధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోవడంతో ఫోన్ పోయిందంటూ ఇప్పుడు బండి సంజయ్ కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్నారు. అసలు కేంద్రం లోని మోడీ ప్రభుత్వం అండతోనే బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారని సతీష్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News