Tuesday, May 14, 2024

ఓటరు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలి : వికాస్‌ రాజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నూతనఓటరు నమోదు, ఓటరు జాబితాసవరణ కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి వికాస్‌రాజ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిజిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలతో ఓటరు నమోదు, సవరణకు అందిన దరఖాస్తుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా నూతనఓటరు నమోదు, జాబితాలో సవరణకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News