- Advertisement -
హైదరాబాద్: బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలవదని ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు తిరస్కరించారని, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ వైపే ఉన్నారని, దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రధాని మోడీ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.
- Advertisement -