Thursday, May 2, 2024

సీనియర్ సీటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : సీనియర్ సీటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దామెర నర్సయ్య, ఉపాధ్యక్షులుగా నాగులగాం నర్సయ్య, కార్యదర్శిగా తేరాల యుగేందర్, సంయుక్త కార్యదర్శిగా మచ్చి నర్సింహారామయ్య, చిదురాల సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా కొండబత్తిని రాజేందర్, కార్యవర్గ సభ్యులుగా గంటి సాంబయ్య, గోకారపు రాజేందర్, కన్నూరు ఉపేంద్రాచారి, అనుగం జనార్ధన్, హనుమాండ్ల ప్రభాకర్‌రెడ్డి, బెండల అర్జునరావు, గంగారపు యాదగిరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

విద్యారణ్యపురి గోపాలపురం హనుమకొండ జిల్లా తృతీయ మహాజన సభను రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్షిక నివేదికను కార్యదర్శి తేరాల యుగేందర్ ఆర్థిక లావాదేవీలను కొండబత్తిని రాజేందర్ ప్రవేశపెట్టారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా కజాంపురం దామోదర్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News