Friday, May 3, 2024

హైదరాబాద్‌లో జరిగే సభను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగే డీవీకే ప్రథమ వర్థంతి సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్)ప్రజాపంద ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో డీవి కృష్ణ ప్రథమ వర్థంతి సభల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమాన్ని ప్రజా యుద్ద కంద రూపశిల్పి, మితవాద, అవకాశ వాదాలను ఓడిస్తూ ప్రజాయుద్ద పంధాను రూపొందించిన రూపశల్పి డీవి కృష్ణ అని అన్నారు.

భారతదేశంలో వ్యవసాయ రంగంలో వచ్చిన పెట్టుబడిదారి విధానాలు పెరిగాయన్నారు. వాణిజ్య పంటలే ఎక్కువగా పండిస్తున్న తీరు గమనించాలని డీవకే నిరూపించారని చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ మతోన్మాద చర్యలను నిరసించాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదారాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి సంతాప సభలో ప్రముఖ పత్రిక సంపాదకులు సతీశ్‌చందర్, ప్రొఫెసర్ కె.లక్ష్మినారాయణ, రంగారావు, రాంచందర్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముంజంపల్లి వీరన్న, అనిల్, యాకయ్య, వెంకటేశ్, శ్రీను, మహేశ్, రాము, లక్ష్మయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News