Saturday, April 26, 2025

మళ్లీ గాయపడిన షమీ… టీమిండియాలోకి వస్తాడా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సయ్యద ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బెంగాల్-మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెన్ను నొప్పితో బౌలర్ షమీ ఇబ్బందిపడ్డారు. వెన్ను నొప్పితో కాసేపు విశ్రాంతి తీసుకొని షమీ మళ్లీ బౌలింగ్ చేశాడు. గత కొన్ని రోజుల నుంచి గాయాలతో షమీ ఇబ్బందిపడుతున్నారు. భారత జట్టులోకి పునరాగమని చేస్తాడనే ప్రచారం జరుగుతున్న సందర్భంగా షమీ వెన్ను నొప్పితో బాధపడడం కలవరానికి గురి చేస్తోంది. ఈ మ్యాచ్ షమీ మూడు వికెట్లు తీసినప్పటికి బెంగాల్ ఓటమిని చవిచూసింది. బెంగల్ పై మధ్య ప్రదేశ్ జట్టు విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News