Thursday, May 2, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్… మొక్కలు నాటిన శశిథరూర్

- Advertisement -
- Advertisement -

Shashi tharur plant trees in Green India challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ నేతృత్వంలోని సభ్యులు శిల్పారామం లోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు.

ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ నేతృత్వంలో హైదరాబాద్ పర్యటనలో బాగంగా శిల్పారామంలో మొక్కలు నాటమని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సభ్యులు కోరారు..గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ ని శశిథరూర్ ప్రత్యేకంగా శశి థరూర్ అభినందించారు. సందర్భంగా శశి థరూర్ మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.హైదరాబాద్ పర్యటన లో బాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించినందుకు శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు..

గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్తుందని ఎంపీలు రంజిత్ రెడ్డి,సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని పర్యావరణానికి మేలు కలిగేలా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.హైదరాబాద్ పర్యటనలో బాగంగా సహచర ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు..సీఎం కేసిఆర్ హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు వెళుతుందని 16 కోట్లకు పైగా ఇప్పటివరకు మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు..

ఈ కార్యక్రమంలో శశి థరూర్ నేతృత్వంలోని సభ్యులు మహువ మొయిత్ర ఎంపి లోక్ సభ, సయ్యద్ జాఫర్ ఇస్లాం ఎంపి రాజ్యసభ, నరేంద్ర జాదవ్ ఎంపి రాజ్యసభ, సుమతి తమిజిచ్చీ తంగపాండియన్‌ ఎంపి లోక్ సభ, ధైర్యశీల్ సంభజిరావు మానే ఎంపి లోక్ సభ, శక్తిసింహ్ గోహిల్, ఎంపి రాజ్యసభ, నదిముల్ హాక్ ఎంపి రాజ్యసభ , పి.ఆర్.నటరాజన్ ఎంపి లోక్ సభ, సంతోష్ పాండే ఎంపి లోక్ సభ, గడ్డం రంజిత్ రెడ్డి ఎంపీ లోక్ సభ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంపీ రంజిత్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News