Wednesday, May 8, 2024

మమతకు మద్దతు పలికిన శివసేన

- Advertisement -
- Advertisement -

Shiv Sena won't contest Bengal elections 2021

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శివసేన మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు. సిఎం ఉద్దవ్ ఠాక్రేతో ఈ అంశంపై చర్చించామన్న సంజయ్ రౌత్ బెంగాల్ లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. బెంగాల్ లో సిఎంకు చెందిన టిఎంసికి తమ మద్దతు ఉంటుందన్నారు. దీదీని ఓడించేందుకు ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ నిజమైన బెంగాల్ టైగర్ అని, ఆమె ఘనవిజయం సాధించాలంటూ ట్వీట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మార్చి 27 నుండి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. ఫలితాలను మే 2 న వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News