- Advertisement -
ముంబై: శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తో సీనియర్ ఆటగాడు, వైట్బాల్(వన్డే) జట్టు సారథి రోహిత్ శర్మకు చెక్ పెట్టే యోచనలో బిసిసిఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఐపిఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినా.. శ్రేయస్ సారధ్యానికి బిసిసిఐ ఫిదా అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో టీమిండియా సారథిగా శ్రేయస్ను నియమించనున్నట్టు తెలుస్తోంది. టెస్టుల నుంచి వైదొలిగిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసే క్రమంలో అయ్యర్కు చోటు కల్పించనున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు (Former cricketers) శ్రేయస్కు టీమిండియాను నడిపించే సత్తా ఉందని అభిప్రాయపడుతున్న తరుణంలో ఈ వార్తకు మరింత బలాన్ని చేరుకూరినట్లు అయ్యింది. ఐపిఎల్లో మూడు జట్లకు సారథిగా వ్యవహరించిన అయ్యర్ మూడు జట్లను ఫైనల్ వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.
- Advertisement -