Friday, May 3, 2024

ఇంటిని మిస్ అవుతున్నా

- Advertisement -
- Advertisement -

Shriya says she will stay in India

 

అందాల తార శ్రియా పెళ్లి చేసుకున్న తర్వాత స్పెయిన్‌లో సెటిలైంది. భర్త ఆండ్రీ కొస్చెవ్‌తో కలిసి స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో కాపురం పెట్టింది. మూడేళ్ళ తర్వాత ఆమెకి ఇండియాకి తిరిగి రావాలని అనిపించిందట. 2018లో ఆమె పెళ్లి సింపుల్‌గా ముంబయ్‌లో జరిగింది. ఇప్పుడు మూట ముల్లె సర్దుకొని ఇండియాకి వస్తోంది. ఇకపై ఇండియాలోనే ఉంటామని చెబుతోంది శ్రియా. ఈ సందర్భంగా “ఇండియాకి తిరిగి వస్తున్నాము. ఇంటిని మిస్ అవుతున్నా. నమస్తే… బై బై” అని తన ఇన్ స్టాగ్రామ్‌లో పేర్కొంది. శ్రియా, ఆమె భర్త ఇక ముంబయ్‌లో కాపురం పెడుతారు. 37 ఏళ్ల శ్రియాకి ఇంకా పిల్లలు కలగలేదు. ఇక ఆమె నటించిన ‘గమనం’ అనే తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి తీస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో చిన్న పాత్ర పోషిస్తోంది శ్రియా.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News