Thursday, May 2, 2024

సెమీస్‌లోనే సింధు ఔట్

- Advertisement -
- Advertisement -

Sindhu defeat in women's singles semifinals

 

లండన్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు ఓటమి పాలైంది. థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చోచువాంగ్‌తో జరిగిన సెమీస్ పోరులో సింధుకు చుక్కెదురైంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన చోచువాంగ్ 2117, 219 సింధును చిత్తు చేసింది. చోచువాంగ్‌కు కనీస పోటీ కూడా ఇవ్వకుండానే సింధు ఓటమి పాలుకావడం గమనార్హం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అకానె యమగూచి (జపాన్)పై అసాధారణ పోరాట పటిమతో విజయం సాధించిన సింధు సెమీస్‌లో మాత్రం చోచువాంగ్‌కు ఎదురు నిలువలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన చోచువాంగ్ 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News