హైదరాబాద్: నగరంలోని ప్రధాన జంక్షన్లలో ఉప్పల్ క్రాస్ రోడ్ ఒక్కటి. ఈ చౌరస్తాలో నలువైపుల నుంచి దూసుకువచ్చే వాహనాలను తప్పించుకుని పాదచారులు రోడ్డు దాటాలంటే ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకోవాల్సిందే.. ఎందుకంటే వరంగల్ వైపు నుంచి సికింద్రాబాద్తోపాటు హైదరాబాద్ వచ్చే వాహనాలు ఉప్పల్ క్రాస్ రోడ్ మీదగా పోవాల్సిందే.. అదేవిధంగా ఎల్బినగర్ వైపు నుంచే వచ్చేవారు సైతం ఉప్పల్ క్రాస్ రోడ్ను దాటాల్సిందే.. దీంతో ఈ చౌరస్తాలో ప్రతి నిమిషం వాహనాలు చీమల దండును తలపిస్తుంటాయి. దీంతో ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు కష్ట కష్టాలు పడుతుంటారు. అయితే పాదచారుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి.
హైదరాబాద్ మెట్రో డవలఫ్మెంట్ అథారటీ స్కై వాక్కు శ్రీకారం చుట్టింది. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్కైవాక్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ స్కైవాక్ను ఆర్.పి ప్రాజెక్టు అనే సంస్థ నిర్మిస్తోంది. ంతేకాకుండా రూ.311 కోట్ల వ్యయంతో ఉప్పల్ చౌరస్తా మీదగా ప్లై ఓవర్ను సైతం నిర్మించనున్నారు. ఇందుకు ఇప్పటీకే ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేయడంతో పనులు సైతం ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా ఇప్పటికే రూ.28లక్షల వ్యయంతో ఈ చౌరస్తాను పూర్తిగా అభివృద్ది పర్చడంతో పాటు సుందరీకరించారు. దీంతో ఒకవైపు మెట్రో బ్రిడ్జి మరో వైపు ప్లైవర్, మధ్యలో స్కైవాక్ నిర్మాణం పూరైతే ఇప్పటికే ఆకుట్టకుంటున్న ఈ చౌరస్తా త్వరలో మరింత ఆకర్షనీయంగా మారనుంది.
ప్రత్యేక ఆకర్షణంగా స్కైవాక్ నిర్మాణం….
ఉప్పల్ క్రాస్ రోడ్లో నిర్మిస్తున్న స్కైవాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్కైవాక్పై నడుస్తూ ఉప్పల్ అందాలను తిలకించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు చుట్టూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా స్కైవాక్ను నిర్మిస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా చుట్టూ 6 చోట్ల స్కైవాక్ ఎక్కడం, దిగడం కోసం ఎస్కలేటర్స్, లిప్టులను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నేరుగా రెండు వైపుల ఉప్పల్ మెట్రో స్టేషన్లోకి వేళ్లే విధంగా స్కైవాక్ను నిర్మిస్తున్నారు. రూ.25 కోట్ల వ్యయంతో చేపడుతున్న స్కై వాక్ను 36 పిల్లర్లతో 6.15 మీటర్ల ఎత్తులో 660 మీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు.
Skywalk works Started at Uppal junction