Thursday, May 2, 2024

కుమ్రం సూరుకు ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

Solid tribute to Kumram Suru

మన తెలంగాణ / ఉట్నూర్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని గొండుగూడ పంచాయతి పరిధి లోని కోలాంగూడ గ్రామంలో కుమ్రం సూరు 24 వ వర్ధంతి సభ ను బుధవారం ఘనంగా నిర్వహించారు. సూరు వర్ధంతి సభకు ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి లు పాల్గొని సూరు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుమ్రం భీం సన్నిహితుడు కోలాం పోరాట వీరుడు కుమ్రం సూరు అన్నారు. సూరు ఆశయానికి అనుగుణంగా నేటి యువత పని చేయాలని విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నత రంగాల్లో రాణించాలన్నారు. కుమ్రం సూరు చేసిన సేవలను గుర్తించి అప్పటి ప్రభుత్వం ఆదివాసి కొలాం క్రంతివీర్ అనే బిరుదును కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం కొలాం లకు మంజూరైన కొలాం కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పంద్ర జైవంత్ రావు, వైస్‌ఎంపిపి బాలాజీ, ప్యాక్స్ చైర్మెన్ ప్రభాకర్, కో ఆప్షన్ మెంబర్ రషీద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజీమొద్దిన్, జిల్లా నాయకులు శ్రీరామ్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, మండల అధ్యక్షులు కందుకూరి రమేష్, కోలాం సంఘం నాయకులు, టిఆర్‌ఎస్ నాయకులు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News