Tuesday, April 30, 2024

కన్న తండ్రిని చంపి…ఇంట్లోనే శవాన్ని దాచిన కసాయి కొడుకు..

- Advertisement -
- Advertisement -

భూ తగాదాలతో ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే చంపిన దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లిలో చోటుచేసుకుంది. ధనుంజయ్ అనే వ్యక్తి, తన తండ్రి తిరుపతిపై ఈ నెల 16న కర్రతో దాడి చేసి హత్యచేశాడు. ఈ విషయం బయటికి తెలియకుండా మూడు రోజుల పాటు తండ్రి శవాన్ని ఇంట్లోనే దాచి.. తన తండ్రి కనిపించడం లేదంటూ మూడు రోజులు గ్రామం మొత్తం వెతుకుతున్నట్లు నటించాడు.

నిన్న(శనివారం) రాత్రి బైక్ పై తండ్రి శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేసి తిరిగి వస్తుండగా పెట్రోల్ అయిపోవడంతో మధ్యలో బైక్ ఆగిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామస్థులు ధనుంజయ్ ను చూసి దగ్గరికి వెళ్లగా.. దుర్వాసన రావడంతో నిలదీశారు. గ్రామస్థుల నిలదీతతో తన తండ్రిని చంపి, చెరువులో పడేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News