Saturday, April 27, 2024

స్పాలపై ఎస్‌ఓటి పోలీసులు దాడి..14మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదాపూర్‌లోని స్పాలపై ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు.స్పాల ముసుగులో నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఎస్‌ఓటి పోలీసులు రాయదుర్గం పిఎస్, మియాపూర్ పిఎస్ పరిధిలో నాలుగు స్పాలపై దాడులు చేశారు. ఇందులో 14మందిని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.

లీస్పా సెలూన్ వెల్‌నెస్ సెంటర్ యజమాని వెంకటనారాయణ, విజయలక్ష్మి, జంట స్పా మేనేజర్ ఫర్హాన్, ఎఆర్‌కే వెల్‌నెస్ స్పా యజమాని అమీర్ అహ్మద్, నిమ్మల నవీన్‌కుమార్ గౌడ్, మేనేజర్ శామ్యూల్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12మొబైల్ ఫోన్లు, డివిఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News