Saturday, April 27, 2024

ఎమ్మెల్యేకు ఙ్ఞాపికను అందజేసిన శ్రీనాథ్

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్: నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరి ధిలోని నాగనూల్ గ్రామానికి చెం దిన శ్రీనాథ్ గతంలో తన ఆరోగ్యం బాగోలే దని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని క లవడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి శ్రీనాథ్ మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష రూపాయల ఎల్‌ఓసిని మంజూరు చేయించి అందజేశారు.

ఇందుకు కృతఙ్ఞతగా బుధవారం జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షల్‌లో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే దంపతుల చిత్రపటాన్ని శ్రీనాథ్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి దంపతులకు అందజేశారు.

మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్‌టిఆర్ సంఘం మాజీ అధ్యక్షుడు హౌదేకర్ రఘురాంజి గుండెపోటుతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి బాధి త కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News