Sunday, May 5, 2024

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అన్‌లైన్ కోటాను ఈ రోజు సాయంత్ర 4 గంటలకు విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా ఉన్నట్టు టీటీడీ తెలిపింది. దాంతో పాటు ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ.. ఈ రోజు ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 24 ఉదయం 10గంటల వరకు ఉంటుంది. ఈ లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News