Friday, May 3, 2024

దశల వారీగా అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎంపిపి కృపేష్ , జడ్పిటిసి మహిపాల్

రంగారెడ్డి: పోల్కంపల్లిలో దశలా వారీగా అభివృద్ధి పనులను చేస్తున్నామని మండల పరిషత్ అధ్యక్షులు కృఫేష్, జడ్పిటిసి భూపతిగళ్ల మహిపాల్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో సర్పంచ్ చెర్కూరి అండాలు గిరి అధ్యక్షతన జరిగిన రూ. రూ.10 లక్షలతో అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ చెర్కూరి అండాలు గిరి, ఎంపిటిసి మంగ రవిందర్‌తో కలిసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. ఆరు నెలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి 100 శాతం అభివృద్దిని సాధించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సబ్యులు ఎండి షరీఫ్, పిఏసిఎస్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, ఏఈ ఇంద్రాసేనారెడ్డి, ఎంపిడిఓ క్రాంతికిరణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News