Sunday, April 28, 2024

పరీక్షల పట్ల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదు

- Advertisement -
- Advertisement -
సిలబస్ పూర్తి చేసిన తరువాతే పరీక్షలు నిర్వహిస్తాం : విసి రవీందర్‌ యాదవ్

హైదరాబాద్ : పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఉస్మానియా యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణను కలిసి తమ సమస్యలు వివరించారు. సిలబస్ పూర్తి కానందున 15 రోజుల పాటు పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఏ కళాశాలల్లో ఏయే సబ్జెక్టుల్లో సిలబర్ పూర్తి కాలేదో వారు వివరించారు. వెంటనే స్పందించిన విసి విద్యార్థుల శ్రేయస్సు కోసమే తాము పనిచేస్తున్నామని ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.

పరీక్షలు వాయిదా వేయటంతో ఉత్పన్నమయ్యే సమస్యలను విద్యార్థులకు వెల్లడిస్తూ పరీక్షలు వాయిదా వేస్తే యూనివర్శిటీ పరిధిలో 200 పీజీ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని తెలిపారు. విదేశీ విద్యార్థులు ఇప్పటికే తమ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయమని అడగటం సరైంది కాదని తెలిపారు. ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు వెల్లడించిన అంశాలపై ఈ నెల 22వ తేదీన యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమావేశమై పరీక్షల వాయిదా విషయమై స్పష్టత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సమావేశంలో చర్చిస్తామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వివరించారు. యూనివర్శిటీ క్యాంపస్, నిజాంకళాశాల, సైఫాబాద్ సహా ఆయా కళాశాల విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్‌లతో సమావేశమైయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News