Thursday, May 2, 2024

కొత్త కళాఖండం ‘శ్రీ అనంత పద్మనాభస్వామి’ని ఆవిష్కరించిన శ్రీమతి సుధా రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శివ్ నారాయణ్ జ్యువెలర్స్ తమ తాజా కళాఖండం ‘శ్రీ అనంత్ పద్మనాభస్వామి’ ప్రతిమ ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహోన్నత దాత మరియు స్టైల్ ఐకాన్ శ్రీమతి సుధా రెడ్డి , హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాత్మక వైభవం, నైపుణ్యంతో కూడిన పనితనం మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క వేడుక గా ఈ కార్యక్రమం నిలిచింది. ఈ మాస్టర్ పీస్ ను ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో (IIJS) 2023లో అధికారికంగా విడుదల చేయగా, అక్కడ ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నందుకు తన ఆనందం వ్యక్తీకరించారు. శ్రీమతి సుధా రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “శ్రీ అనంత పద్మనాభస్వామి’ ప్రతిమ సృష్టి మా బృందం యొక్క అంకితభావం మరియు అభిరుచికి సంబంధించినది, ముఖ్యంగా ఈ కళాఖండం మా కళాకారుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా మన సంస్కృతి యొక్క గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అసాధారణ సృష్టిని ఆవిష్కరించిన శ్రీమతి సుధా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

ఈ కార్యక్రమం కళ, సంస్కృతి మరియు విలాసవంతమైన కలయికగా గుర్తించబడింది మరియు అతిథులు శ్రీ అనంత పద్మనాభస్వామి యొక్క అందాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కేరళలోని తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రతిష్టించబడిన దివ్య విగ్రహం నుండి ప్రేరణ పొందిన ఈ ఆభరణం సూక్ష్మమైన అంశాలను సైతం విశేషమైన ఖచ్చితత్వంతో ఒడిసిపట్టింది. యోగ నిద్ర స్థితిలో ఉన్న మహా విష్ణువు, జ్యోతిర్లింగంపై ఆయన చేయి శివుడిని సూచిస్తే, విష్ణువు నాభి నుండి ఉద్భవించి కమలం పైన బ్రహ్మ దేవుడు కూర్చున్నట్లు గా తీర్చిదిద్దిన ఈ ప్రతిమ పురాతన భారతీయ గ్రంథాల కు ఉత్కృష్టమైన ప్రాతినిధ్యం వహిస్తుంది.

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆభరణం 8 అంగుళాల ఎత్తు మరియు 18 అంగుళాల పొడవు కలిగి ఉంటుంది. 2 నెలల పాటు 32 మంది ప్రతిరోజూ 16 గంటలు పని చేసి చేతితో తయారు చేసిన ఈ పారాగాన్ ఆభరణం ఆశ్చర్యపరిచే విధంగా 2.8 కిలోల బరువు వుంది . మొత్తం 500 క్యారెట్ల బరువు కలిగిన దాదాపు 75,000 అధిక-నాణ్యత కలిగిన వజ్రాలతో అలంకరించబడిన శ్రీ అనంత పద్మనాభస్వామి రూపు చూడతగ్గ రీతిలో ఉంటుంది. ఈ సంచలనాత్మక సృష్టితో తమ 9వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్‌కు చేరువయ్యారు. చైర్మన్- శ్రీ కమల్ కిషోర్ అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ తుషార్ అగర్వాల్ మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ ఆభరణం మానవ సృజనాత్మకత యొక్క ప్రకాశం, లగ్జరీ ఆభరణాల యొక్క కాలానుగుణ ఆకర్షణకు నిజమైన నిదర్శనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News