Thursday, May 2, 2024

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క్వాష్ పిటిషన్‌ను మంగళవారం ప్రస్తావించేందుకు సీజేఐ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో టిడిపి అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు కేసును సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ప్రస్తావించారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, తక్షణమే విచారణ జరిపించాలని లూత్రా కోరారు. అయితే రేపు ప్రస్తావించాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు తీసుకోవాలని లూత్రా వాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశమని… అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సిద్ధార్థ లూథ్రా అన్నారు. ఎన్ని రోజులు కస్టడీలో ఉన్నారని సీజేఐ ప్రశ్నించగా.. ఈ నెల 8న అరెస్ట్ చేశారని లూథ్రా తెలిపారు. దీంతో రేపు ప్రస్తావన జాబితా ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఎపి ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సిఐడి తరఫున వాదించిన రంజిత్ కుమార్ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News