Monday, May 13, 2024

ఎపి గవర్నర్‌ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్

- Advertisement -
- Advertisement -

Tamili sai inquiries on ap governor health condition

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఏఐజి ఆసుపత్రిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం పరామర్శించారు. తరువాత ఆమె మాట్లాడుతూ ఎపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను పరామర్శించేందుకు రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఒక టీం ఆఫ్ డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను ఒక డాక్టర్‌ని కాబట్టి హాస్పిటల్ ఎండి డాక్టర్ నాగేశ్వరరెడ్డితో మాట్లాడటం జరిగింది. భగవంతుని దయవల్ల ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గవర్నర్‌కి సంబంధించిన హెల్త్ బులెటిన్ రాజ్‌భవన్ వర్గాలు ఇస్తాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News