Wednesday, May 1, 2024

కారులో కిడ్నాప్…. ఆస్పత్రికి వెళ్తున్న యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

rape

 

భోపాల్: ఓ యువతిని కారులో ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని గోవింద్‌పూరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎప్రిల్ 18 ఉదయం 7.30కు ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి జెహెచ్ ఆస్పత్రిలోకి వెళ్తుంది. ఆస్పత్రికి సమీపంలో ఇద్దరు యువకులు ఆ యువతిని కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఒకరు అత్యాచారం చేశారు. ఆ యువతి స్పృహ కోల్పోయి మూడు గంటల తరువాత నిద్రం నుంచి మేల్కొంది. నిందితులు మయూర్ పార్క్ వద్ద యువతిని విడిచి ఈ విషయం ఎవరకైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ విషయం తన స్నేహితురాలుకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చింది. వెంటనే యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరోగ్య పరీక్షల నిమిత్తం యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులు షఫిక్ ఖాన్(24), అబిద్ ఖాన్ (18) గా గుర్తించామని ఎఎస్‌ఐ శశి చుబే తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఎప్రిల్ 17న భోపాల్ ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇదో రెండో కేసు అని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News