Sunday, April 28, 2024

రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్ధిపేట: రైతులు ధైర్యంగా ఉండాలని, రైతు నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, రైతుల పక్షపాతి అయిన నాయకుడు సిఎం కెసిఆర్ ఉన్నారని, కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

Also Read: ఈ రెండు నెలల్లో ఊరూరా పెళ్లి సందడి

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే వడగండ్ల వాన కురిసిన ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం, దుబ్బాక, తొగుట మండలాల్లో రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానతో ఎంతో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలో పర్యటిస్తూ.. రైతులను మంత్రి ఓదారుస్తున్నారు. భారత దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా రూ.2, 3 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, కానీ సిఎం కెసిఆర్ స్వయంగా రైతుబిడ్డ కాబట్టి రైతులను కాపాడుకోవాలని, రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఇప్పటికే రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించారని హరీశ్ రావు తెలిపారు. గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్క రైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. వాస్తవానికి యాసంగిలో ఎంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి, ప్రైవేటు ఎక్చేంజ్‌లో కొని రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసు: దస్తగిరి ఇంటికి సిబిఐ అధికారులు

కానీ దురదృష్టం రైతుబంధు ఇచ్చి, నాణ్యమైన కరెంటు ఇచ్చి నోటి కాడికి వచ్చిన బుక్క జారిపోయినట్లు ఈ ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో చాలా నష్టం జరిగిందని ఆయన బాధను వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయని, నిన్నరాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయన్నారు.  ఇప్పటికే సిఎం కెసిఆర్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ దరిమిలా అన్నీ జిల్లాలో మంత్రులు వడగండ్ల వాన కురిసిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తుందని హరీశ్ రావు వివరించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడుకుంటామని, డిసెంబరు నెలలో రైతులు వరినాట్లు వేసిన దరిమిలా శ్రీరామ నవమి పండుగలోపు చాలా చోట్ల పంట కోతలు పూర్తయ్యాయన్నారు. మనం భవిష్యత్తులో నెలముందే పంట కోత తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వానా కాలం పంట ఒక నెల ముందు జరుపుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోకుండా ఉంటారని రైతులకు మంత్రి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News