Wednesday, May 8, 2024

వరదలతో నష్టం…. తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర అధికారుల బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరద నష్టాన్ని అంచనా వేయటానికి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటించనుంది.  తెలంగాణ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఏర్పడిన వరదల మూలంగా అనేక జిల్లాలో నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ అధికారుల బృందంలో
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉండనున్నారు.

Also Read: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక…

ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు కునాల్ సత్యార్థి నాయకత్వం వహించనున్నారు. కేంద్ర అధికారుల బృందం 31 జూలై 2023న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ.. కేంద్ర అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News