- Advertisement -
ఈ నెల 25న పవన్కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలవ్వనుంది. ‘ఓజీ’ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్కు అవకాశమిచ్చింది. దాని టికెట్ ధర జిఎస్టితో కలిపి రూ.800, సినిమా విడుదల రోజు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరల పెంపునకు వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.100(జిఎస్టితో కలిపి), మల్టీప్లెక్స్లలో రూ.150(జిఎస్టితో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఓజీ టికెట్ ధరల పెంపునకు ఎపి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి విదితమే.
- Advertisement -