Tuesday, April 30, 2024

కరీంనగర్ నుంచే తెలంగాణ పోరు ప్రారంభమైంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కెటిఆర్ మాట్లాడారు. కరీంనగర్‌లో తాగు నీటి సమస్యను పరిష్కరించామని, వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అనిప్రశంసించారు. తెలంగాణ పోరు కరీంనగర్ నుంచి ప్రారంభమైందని గుర్తు చేశారు. కరీంనగర్‌లో వచ్చిన మార్పు ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందని మెచ్చుకున్నారు. బిఆర్‌ఎస్ పాలనలో పల్లెలు బాగుపడ్డాయని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, గంగుల కమలాకర్, స్థానిక ఎంఎల్‌ఎలు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News