- Advertisement -
హైదరాబాద్ : సిఎం కె.చంద్రశేఖరరావు మదిలో నుంచి వచ్చిన అనేక సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయని తెలిపారు. సిఎం కెసిఆర్ కాన్సెప్ట్కు సంబంధించి సాండ్ఆర్ట్లో పేరు గాంచిన కాంత్రిసా రూపొందించిన పెయింటింగ్ను మంగళవారం మంత్రి తలసాని తన నివాసంలో ఆవిష్కరించారు. సిఎం చిత్రాన్ని రూపొందించిన కళాకారుడు కాంత్రిసాను తలసాని ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పవన్కుమార్ గౌడ్, అత్తిని శ్రీనివాస్ గౌడ్, బందూక్ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మురారి, కాదంబరి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana State schemes are ideal for nation
- Advertisement -